ఆలయాలు

Sacred Tirumala Tirupati Temple showcasing ancient Dravidian architecture

తిరుమల ఆలయ చరిత్ర

తిరుమల ఆలయ చరిత్ర కలియుగంలో భక్తుల కొంగుబంగారమై కోరికలు తీర్చే ఆపద్మోక్షుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలవబడే ఆయనను ఒక్కసారి స్మరించినా చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని, స్వామి నామం ఒక్కసారి జపించినా చాలు అని భక్తుల విశ్వాసం. శ్రీనివాసుని మహిమలను అన్నమయ్య, త్యాగయ్య, వేంగమాంబ వంటి వారు తమ కీర్తనల ద్వారా లోకానికి తెలియజేశారు. పరమ పావనమైన తిరుమల చరిత్ర గురించి, వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర […]

తిరుమల ఆలయ చరిత్ర Read More »

KAIlasa devalayam, maharashtra

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ దేశం, ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుత కట్టడాలను సృష్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం. ఇది అతి పురాతనమైన, ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని 16వ గుహలో (కేవ్ నం. 16) ఉంది. రాష్ట్రకూట రాజు మొదటి

అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం Read More »

Dwadasa Jyotirlingalu – 12 Sacred Shiva Temples Across India

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర అభిషేకప్రియుడు, భోళాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు — ఇలా చెప్పుకుంటూ పోతే పరమేశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. మన శైవ ఆరాధనలో అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు నిరంతరం దివ్యశక్తిని ప్రసరింపజేస్తూ విశ్వాన్ని, అందులోని సమస్త జీవులను దుష్టశక్తుల నుండి కాపాడుతున్నాయని నమ్మకం. ప్రతి హిందువుకీ జీవితంలో కనీసం ఒక్కసారైనా జ్యోతిర్లింగాలను దర్శించాలనే

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర Read More »

Garbharakshambigai Temple is a Hindu temple dedicated to Shiva located in Thirukarukavoor, Tamil Nadu, India

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తుడై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషంగా ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందింది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం.గర్భరక్షాంబికా ఆలయం సంతాన ప్రాప్తి, ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతానప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కలగజేయడానికి సాక్షాత్తు

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు Read More »

The Mahalaxmi temple located in Ratlam, Madhya Pradesh

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నిర్వహణ వెనుక భిన్నమైన పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుని, తర్వాత ప్రసాదంగా లడ్డూ, పులిహోర, చక్రపొంగలి వంటి పదార్థాలను స్వీకరిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నం జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం. మాల్వా ప్రాంతంలోని ఈ మహాలక్ష్మి ఆలయం

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా? Read More »

మహారాష్ట్రలోని లోనార్ సరస్సు సమీపంలోని మోత మారుతి దేవాలయం అయస్కాంత ఆంజనేయ విగ్రహం

మోతా మారుతి ఆలయం

మోతా మారుతి ఆలయం శ్రీరామ భక్తుడైన హనుమంతునికి గ్రామానికో గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులు ఆయనను నమ్మి కొలుస్తూ, పలికే దైవంగా భావిస్తారు. హనుమంతుని ఆలయాల్లో ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. అటువంటి ప్రత్యేకత గల దేవాలయాల్లో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో, లోనార్ సరస్సు సమీపంలో ఉన్న మోత మారుతి దేవాలయం. దీనిని మోట మారుతి దేవాలయం అని కూడా అంటారు. “మోత”

మోతా మారుతి ఆలయం Read More »

తెలంగాణ రాష్ట్రంలోని కాసింపేట గ్రామంలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం స్వయంభు విగ్రహం

శ్రీ మానసాదేవి ఆలయం

శ్రీ మానసాదేవి ఆలయం ఈ భూమండలంలోని సర్పాలన్నింటికీ అధిదేవతగా శ్రీ మానసాదేవిని భావిస్తారు. సర్పదోషాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే దేవిగా ఆమెను భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మానసాదేవి ఆలయం, దక్షిణ భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం వెలసి ఉంది. ఆలయ మహాద్వారం పైభాగంలో వినాయకుడు, సీతారామలక్ష్మణ సమేత

శ్రీ మానసాదేవి ఆలయం Read More »

18 Sakti Peetalu story in Telugu

అష్టాదశ శక్తి పీఠాలు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు

18 Sakti Peetalu story in Telugu Read More »

Scroll to Top