Car crushing lemons under its front tires as part of a traditional Indian ritual for protection.

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు?

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు? మన దేశంలో బైక్, కారు లేదా ఇతర వాహనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ముందుగా పూజ చేయడం ఆనవాయితీ. వాహనం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి తొక్కిస్తే మంచిదని, ఇలా చేయకపోతే వాహనానికి లేదా యజమానికి అపశకునం జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఇది కేవలం ఒక ఆచారమా? నమ్మకమా? లేక దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మోటార్ వాహనాలు లేని సమయంలో ప్రయాణాలకు […]

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు? Read More »

భారతీయ సంప్రదాయ నమస్తే అంజలి ముద్రలో ఇద్దరు వ్యక్తులు

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం అందరికీ నమస్కారం. సాధారణంగా మనకు పెద్దవారు కనిపించినప్పుడు నమస్కారం చేస్తుంటాం. హిందూ సంప్రదాయంలో ఇది ఒక గొప్ప అలవాటు. దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని తగ్గించి ఎదుటివారిని గౌరవించడం. మనము రెండు చేతులను హృదయానికి దగ్గరగా జోడించడాన్ని యోగశాస్త్రంలో అంజలి ముద్ర అని అంటారు. వేలి చివరల్లో పంచభూత శక్తులకు సంబంధించిన పాయింట్లు ఉంటాయని విశ్వసిస్తారు. చేతులను జోడించి స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ ప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి.

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం Read More »

అరిటాకులో సంప్రదాయ పద్ధతిలో వడ్డించిన తెలుగు విందు భోజనం

అరిటాకులో భోజనం వడ్డించే విధానం

అరిటాకులో భోజనం వడ్డించే విధానం   “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో అరిటాకుపై భోజనం చేయడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అరిటాకులో వడ్డించడం, భోజనం చేయడం కూడా ఒక కళ. ఆహార పదార్థాలను పద్ధతి ప్రకారం అమర్చడాన్ని “పరిమార్చడం” అని అంటారు. మరి అరిటాకులో భోజనం వడ్డించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.  ముందుగా అరిటాకును శుభ్రంగా కడగాలి. మనం కుడిచేత్తో అన్నం కలుపుకొని తింటాం కాబట్టి, అరిటాకు వెడల్పుగా ఉండే పెద్ద

అరిటాకులో భోజనం వడ్డించే విధానం Read More »

తెలంగాణ రాష్ట్రంలోని కాసింపేట గ్రామంలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం స్వయంభు విగ్రహం

శ్రీ మానసాదేవి ఆలయం

శ్రీ మానసాదేవి ఆలయం ఈ భూమండలంలోని సర్పాలన్నింటికీ అధిదేవతగా శ్రీ మానసాదేవిని భావిస్తారు. సర్పదోషాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే దేవిగా ఆమెను భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మానసాదేవి ఆలయం, దక్షిణ భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం వెలసి ఉంది. ఆలయ మహాద్వారం పైభాగంలో వినాయకుడు, సీతారామలక్ష్మణ సమేత

శ్రీ మానసాదేవి ఆలయం Read More »

Day 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu |

తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం గోదాదేవిగా జన్మించిన ఆండాళ్- శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో ధనుర్మాసంలో సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు  గానం చేసి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ తిరుప్పావై లో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి

Day 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu | Read More »

Harivaraasanam meaning in telugu

హరివరాసనం తెలుగులో అర్థం హరివరాసనం విశ్వమోహనం. శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే ఈ మధురమైన  పాట వింటే భక్తుల మనసులో ఆనందం తాండవిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. శబరిమలలో ప్రతిరోజూ స్వామిని నిద్రపుచ్చడానికి, ఆలయాన్ని మూసేసే ముందు ఈ కీర్తనను ఆలపిస్తారు. హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తూ, చివరికి ఒక్క దీపం

Harivaraasanam meaning in telugu Read More »

సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం

సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము.  మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు. శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి

సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం Read More »

క్షీర సాగర మథనం

క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది.

క్షీర సాగర మథనం Read More »

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి

కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్  అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే  రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి Read More »

Scroll to Top