రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి […]