పురాణాలు » పురాణ కథలు

పురాణ కథలు

పురాణ కథలు సనాతన ధర్మంలోని భక్తి, ధర్మం, నీతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కథల రూపంలో అందిస్తాయి. ఈ విభాగంలో శివ పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, భాగవత పురాణం మరియు ఇతర పురాణాల నుండి ఎంపిక చేసిన తెలుగు పురాణ కథలను చదవవచ్చు.

Divine illustration of Manidweepa, the celestial abode of Goddess Lalita Devi as described in Manidweepa Varnana."

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన మణిద్వీపం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నివాసస్థలం. మణిద్వీపాన్ని శ్రీపురం, శ్రీనగరం అని కూడా అంటారు. వేదవ్యాసుడు దీనిని సుధాసముద్రం అనే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న దివ్య ద్వీపంగా వర్ణించాడు. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలకు అవతల ఉన్న సర్వలోకం. ఆ సర్వలోక పరిధిలో వేదజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. మణిద్వీపంలో ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా […]

మణిద్వీప వర్ణన Read More »

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు – పార్వతి దేవి, యశోదా, కౌసల్య, దేవకి, అంజనా దేవి వంటి మహానుభావ తల్లుల దివ్య చిత్రాలతో కూడిన YouTube థంబ్‌నెయిల్.

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు Read More »

గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని మొసలి నుంచి రక్షించేందుకు గరుడునిపై వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరిస్తున్న శ్రీమహావిష్ణువు.

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం

గజేంద్రమోక్షం – సంపూర్ణ శరణాగతికి పరమ నిదర్శనం శ్రీమద్భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధం రెండవ, మూడవ, నాల్గవ అధ్యాయాలలో వివరించబడిన గజేంద్రమోక్షం భక్తి, శరణాగతి, భగవదనుగ్రహ మహిమలను తెలియజేసే అత్యంత పవిత్రమైన ఘట్టాలలో ఒకటి. ఈ కథను శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించాడు. తామస మన్వంతరంలో భగవంతుడు తన భక్తుడైన గజేంద్రుని రక్షించి మోక్షాన్ని ప్రసాదించిన విధానాన్ని ఈ కథ వివరిస్తుంది. త్రికూట పర్వత వైభవం క్షీరసాగర మధ్యలో త్రికూటం అనే మహిమాన్వితమైన పర్వతం ఉండేది.

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం Read More »

వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు – విష్ణువుకు బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారు? జయవిజయుల మూడు జన్మల పురాణ కథ.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు ఉండే ప్రదేశానికి ఇరువైపులా కాపలాగా ఉండే సేవకులే జయ, విజయులు. వీరు స్వామివారికి పరమ భక్తులు. ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే ఉంటూ సేవలు చేసేవాళ్లు. విష్ణుమూర్తిని చూడటానికి వచ్చే వాళ్లను గమనించి, లోపలికి పంపడమే వీరి పని. మహర్షుల రాక: ఒకరోజు బ్రహ్మదేవుని కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు మహర్షులు వైకుంఠానికి వచ్చారు. వీరు ఎంతో గొప్ప తపస్సు చేసినవారు.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

18 మహాపురాణాలలో ఏముంది? ప్రతి పురాణం యొక్క ప్రధాన అంశాలు మరియు విశిష్టతలు

18 హిందూ పురాణాలో ఏముంది?

18 పురాణాలో ఏముంది? పురాణాలు హిందూ మత గ్రంథాలు. ఇవి వేదాలకు ఉపబృంహణాలుగా భావించబడతాయి. “పురాణం” అంటే పూర్వకాలంలో జరిగినది అనే అర్థం. అయితే ఇవి నిత్యనూతన సత్యాలను కూడా తెలియజేస్తాయి. అనంత విశ్వం గురించి విస్తృతమైన సమాచారం వీటిలో లభిస్తుంది. దేవాలయంలో చేసే పూజల నుంచి ఆకాశంలో జరిగే అద్భుతాల వరకు అనేక విషయాలకు ఇవే ఆధారం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే పురాణాలను సంకలనం చేశారు. పురాణాలు ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉద్భవించాయని భాగవతంలోని ద్వాదశ

18 హిందూ పురాణాలో ఏముంది? Read More »

క్షీరసాగర మథనం సందర్భంగా దేవతలు, అసురులు వాసుకి నాగును తాడుగా ఉపయోగించి మందర పర్వతాన్ని మథిస్తున్న దృశ్యం. కూర్మావతారంలో శ్రీమహావిష్ణువు పర్వతానికి ఆధారంగా ఉన్న పురాణ ఘట్టం.

క్షీరసాగర మథనం – పురాణాల్లోనే అత్యంత గొప్ప సంఘటన!

క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది.

క్షీరసాగర మథనం – పురాణాల్లోనే అత్యంత గొప్ప సంఘటన! Read More »

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ కాకభూశుండి అనేక కల్పాలను చూసిన అమర ఋషి కథను వివరిస్తున్న చిత్రం.

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి

పురాణాలలోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్  అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే  రచింపబడిన ఒక పురాణ

పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి Read More »

Scroll to Top