హనుమత్-పంచరత్నం
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన “హనుమత్ పంచరత్నం” అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ‘పంచరత్న’ అంటే ఐదు రత్నాలు అని అర్థం. ఈ స్తోత్రంలో ఐదు శ్లోకాలు హనుమంతుని ఐదు రత్నాల్లాంటి గుణాలను వర్ణిస్తాయి.
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ॥ 2 ॥
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారం
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ॥ 3 ॥
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 4 ॥
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశం
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ ॥ 5 ॥
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ॥ 6 ॥
ప్రయోజనాలు:
- ఎవరైతే ప్రతిరోజూ ఉదయాన్నే భక్తితో ఈ ఐదు శ్లోకాలను పఠిస్తారో, వారికి ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సుఖశాంతులు లభిస్తాయి.
- మానసిక భయాల నుండి విముక్తి కలిగి, కార్యసిద్ధి కలుగుతుంది.
- చివరగా స్వామి పాదాలను ఆశ్రయించి మోక్షాన్ని పొందుతారు.
ఈ స్తోత్రం ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెరగడానికి, వ్యాపారస్తులకు ఆటంకాలు తొలగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్సైట్లోని ఇతర పోస్ట్లను తప్పక చూడండి.






